Pages

Monday 7 January 2013

సాగర సంబరాలు

కాకినాడ ప్రజలకి, ఇంకా చెప్పాలంటే మన జిల్లా ప్రజలందరికీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ నిజంగా సంబరాల పండుగే. ఈ నెల పదకొండవ తారీకు నుంచి పదమూడు వరకూ సూర్యారావు పేట వద్ద బీచ్ వేదికగా సాగర ఉత్సవాలు జరుగబోతున్నాయి. సాగర ఉత్సవ కమీటీ అద్యక్షులు కాకినాడ రూరల్ ఎం.ఎల్.ఏ. శ్రీ కురసాల కన్నబాబు గారు, ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ,  జిల్లా కలెక్టర్ శ్రీమతి నీతూప్రసాద్, జాయింట్ కలక్టర్ శ్రీ బాబు,  అడిషనల్ జాయింట్ కలెక్టర్ శ్రీ రామారావు, జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ ప్రోజెక్ట్ డైరెక్టర్(DRDA) మధుకర్ బాబు,  మిగిలిన అధికారులూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ ఉత్సవాన్ని జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు.

నగరంలో మూడు ఓవర్‌బ్రిడ్జీల మీద, ప్రభుత్వ కార్యాలయాల, కాలేజీల గోడలమీద జిల్లా సంసృతి, జీవనవిధానం, జీవనవైవిధ్యం, చరిత్ర మొదలైన విషయాలకు సంబంధించి రంగురంగుల బొమ్మలు చిత్రిస్తున్నారు. స్వాగత హోర్డింగులు కడుతున్నారు, సాగరసంబరాల ఫ్లెక్సీలు ఎక్కడికక్కడ దర్శనమిస్తున్నాయి. బీచ్‌లో ప్రత్యేక విద్యుత్‌లైన్లు వేసి లైట్‌లు ఏర్పాటు చేస్తున్నారు.
ఈ మూడు రోజులూ ఉదయం 11 గంటల నుంచి రాతి 9 గంటల వరకూ వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ స్థానిక కళాకారులూ, వివిధ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థుల కళా,జానపద,సాంస్కృతిక కార్యక్రమాలు, రాత్రి విధ్యుత్ దీపాల వెలుగులో ప్రముఖ కళాకారులచే సినిమా, మిమిక్రి, సాహిత్య, సంగీత, వినోద కార్యక్రమాలు, లేజర్ షోలు నిర్వాహణకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు వేదికలు ఏర్పాటుచేశారు. సాగరతీరంలో స్టాల్స్ నిర్మిస్తున్నారు.  కడియపు పూల సోయగాలు సందర్శకులకి కనువిందుచేయనున్నాయి. ఇరవై స్టాల్స్‌ని కడియపు పూలమొక్కల కోసం కేటాయిస్తున్నారు.

ఉత్సవాల ప్రారంబోత్సవానికి ముఖ్యమంత్రి శ్రీ కిరణ్‌కుమార్‌రెడ్డి వస్తారు. కేంద్రమంత్రులు శ్రీ పళ్ళంరాజు, శ్రీ చిరంజీవి కూడా ఈ సాగర సంబరాల్లో పాల్గొంటారట.
ఇవే కాకుండా సందర్శకులకి కనువిందు చెయ్యడానికి ఏడుకోట్ల రూపాయల వ్యయంతో శిల్పారామం రూపుదిద్దుకొంటుంది. ఫ్లవర్‌షోలు, సైకత శిల్పాలూ కూడా మన మనసులని ఉర్రూతలూగించడానికి ఏర్పాటు చేసే అవకాశం ఉంది. తుర్పుగోదావరి జిల్లా విశేషాలను తెలియజేసే చాయాచిత్రాల ప్రదర్శన కూడా ఉంటుంది.  సాంప్రదాయక రుచులని, అందుబాటు ధరలలోనే  అందరికీ అందించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇది రుచుల పండుగ కూడా. సాంప్రదాయ రుచులతో 36 ఫూడ్‌స్టాల్స్‌ని ఏర్పాటుచేస్తున్నారు.  చివరిరోజు ముగింపు ఉత్సవాలకి రాజకీయ ప్రముఖులు, మంత్రులు, సెలబ్రిటీల సమక్షంలో ఫైర్ వర్క్స్ షో జరుగుతుంది.  

కార్యక్రమాల షెడ్యూల్ ఈ రకంగా ఉంది:

11.01.2013 : 3 గంటల నుంచి 6 గంటలవరకు - ప్రారంభోత్సవ కార్యక్రమాలు  తరువాత - మృదంగ విద్వాంశులు యల్లా వెంకటేశ్వరరావు, శాస్త్రీయ నృత్యకళాకారిణి రమావైధ్యనాథన్ ల ప్రదర్శనలు, విద్యసాహు,  సంగీత దర్శకుడు కోటి ల సంగీతవిభావరులూ ఉంటాయి. 

12.01.2013: 10.30 నుంచి 1.00 గంట వరకూ, తిరిగి 3 గంటల నుంచి 6 గంటల వరకూ విద్యార్ద్థులచే సాస్కృతిక కార్యక్రమాలు. తరువాత సినీ గాయకులు, కళాకారుల ప్రదర్శనలు ఉంటాయి. శివారెడ్డి మిమిక్రీ ఉంటుంది. 

12.01.2013: 10.30 నుంచి 1.00 గంట వరకూ, తిరిగి 3 గంటల నుంచి 6 గంటల వరకూ విద్యార్ద్థులచే సాస్కృతిక కార్యక్రమాలు. తరువాత సినీ గాయకులు, కళాకారుల ప్రదర్శనలు ఉంటాయి.

మొట్టమొదటిసారి కాకినాడ సాగరతీరంలో జరుగుతున్న బీచ్ ఫెస్టివల్‌లో అందరూ పాల్గొని ఆనందిస్తారని అనుకొంటున్నను. ఈ తరహా ఉత్సవాలకి ఇది నాందీ కావాలని, ఇకముందు ప్రతీ సంవత్సరం బీచ్ ఫెస్టివల్ జరిగితే చాలా బాగుంటుందని అనుకొంటున్నాను. మరి మీరేమంటారు?

వివరాల సేకరణకి సహకరించిన జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ ప్రోజెక్ట్ డైరెక్టర్(DRDA) మధుకర్ బాబు గారికి, ఎడిషనల్ జాయింట్ కలెక్టర్ శ్రీ రామారావు గారికి కృతజ్ఞతలతో.

© Dantuluri Kishore Varma

4 comments:

  1. చాలా బాగున్నాయండీ ఉత్సవాలు. ఇలా జరుపుతూ మర్చిపోతున్న ప్రాంతీయ గొప్పతనాల్ని అందరికీ గుర్తుచెయ్యటం చాలా మంచి ఐడియా. గోడల మీది బొమ్మలూ అందంగా ఉన్నాయి.

    ReplyDelete
  2. ఇకముందు ప్రతీ సంవత్సరం వారంరోజుల పాటు వీటిని నిర్వహిస్తామంటున్నారు. మీరన్నట్టు, జిల్లా విశేషాలని ఈ విధంగా తెలియజేయడం బాగుంటుంది చిన్ని ఆశ గారు.

    ReplyDelete
  3. sir inka beach festivals jarugutunaya ..!!time extend chesaru ani vinna..!!

    ReplyDelete
  4. లేదు వినయ్ కుమార్ గారు, పుర్తయ్యాయి.

    ReplyDelete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!