Pages

Thursday 26 December 2013

స్వరమే రాగం కదా

1981లో విడుదలైన ఆకలి రాజ్యం సినిమా ఒక సెన్సేషన్. పెద్ద మ్యూజికల్ హిట్. ఎం.ఎస్.విశ్వనాధన్ స్వరకల్పన చేసిన పాటలన్నీ ఒకదానిని మించి ఒకటి అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ పాట నా ఫేవరెట్. జానకి స్వరం నిజంగా కోయిల కూసినట్టు మధురాతి మధురంగా ఉంటుంది. అలాగని బాలు గాత్రం ఏమీ తగ్గిందని కాదు. పాట రచన : ఆచార్య ఆత్రేయ. 
నాయికా, నాయకుల మధ్యపోటీ. ఈ పాటే ఒక తమాషా ప్రయోగం. బాణీకి పాటను రాయడం ఎలానో చూపించారు. 

ఒక శ్రీశ్రీ ఆరాధకుడు అమ్మాయి కళ్ళను చూస్తూ ప్రేమ పాట పాడటం కూడా విశేషమే! అమె తాళం పాడితే, అతను `అహా` అని మైమరచిపోతాడు. అతను స్వరాలు కూరిస్తే `చాలా బాగుందని` ఆమె సౌంజ్ఞ చేసి చెపుతుంది. ఒకరి గొప్పతనం మరొకరికి తెలిసే పోటీపడడం!  `దననీ దససా అన్నా నీదా అన్నా స్వరమే రాగం కదా` అని పాటను కూరుస్తూనే `నీవు నేననీ అన్నా మనమే కాదా` అని ముక్తాయింపు ఇచ్చి, తనమనసులో మాట చెప్పకనే చెప్పాడు. ఇలాంటి తెలివితేటలున్న కుర్రాడిని ఏ అమ్మాయి అయినా వదులుకొంటుందా?


తన్న తన్ననన తన్న తన్ననన తన్నాన ననన తనతన తన్నాన

ఓహో... కన్నెపిల్లవని కన్నులున్నవని

ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ

లల్లలల్లలల లల్లలల్లలల లల్లల లల్లల లాలలాల లాలాలా

చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి

ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ

కన్నెపిల్లవని కన్నులున్నవని

ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ

చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి

ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ

ఏమంటావ్... ఊఁ...

ఉహుఁ... సంగీతం

నన్నానా... ఉఁ... నువ్వైతే

రీసరి... సాహిత్యం ఊహుఁ... నేనౌతా

సంగీతం నువ్వైతే సాహిత్యం నేనౌతా

కన్నెపిల్లవని కన్నులున్నవని

ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ

చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి

ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ



ననననాన సే ఇట్ వన్స్ ఎగైన్

ననననాన... స్వరము నీవై...

తరనన తరరనన స్వరమున పదము నేనై ఓకే

తానే తానే తానా... గానం గీతం కాగా

తరనతన కవిని నేనై

తానా ననన తనా... నాలో కవిత నీవై

నాన నాననా లలలా తనన తరన

కావ్యమైనదీ తలపో పలుకో మనసో

కన్నెపిల్లవని కన్నులున్నవని

ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ

చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి

ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ

సంగీతం నువ్వైతే సాహిత్యం నేనౌతా



ఇప్పుడు చూద్దాం...

తనన తనన తన్న

ఉహూ... తనన తనన అన్నా

తాన తన్న తానం తరనా తన్న

తాన అన్న తాళం ఒకటే కదా

తనన తాన తాన నాన తాన అయ్య బాబోయ్

తనన తాన తాన నాన తాన ఉహ్...

పదము చేర్చి పాట కూర్చలేదా శ భాష్

దనిని దససా అన్నా నీదా అన్నా

స్వరమే రాగం కదా

నీవు నేనని అన్నా మనమే కాదా

నీవు నేనని అన్నా మనమే కాదా

కన్నెపిల్లవని కన్నులున్నవని

కవిత చెప్పి మెప్పించావే గడసరి

చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి

కలిసి నేను మెప్పించేది ఎపుడని

కన్నెపిల్లవని కన్నులున్నవని

కవిత చెప్పి మెప్పించావే గడసరి

చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి

కలిసి నేను మెప్పించేది ఎపుడని

ఆహాహా లలల్లా ఆహాహా...
© Dantuluri Kishore Varma 

అలా నా నిరీక్షణ పూర్తయ్యింది!

పండుగ సీజన్. జనాలతో కిటకిటలాడుతున్న మెయిన్‌రోడ్‌లో, బట్టలషాపుల ముందు పార్కింగ్ ప్లేస్ దగ్గర పళ్ళ సైకిలు ఆపుచేశాడు అతను. కేరేజీకి కట్టిన వెడల్పుగా ఉన్న పెద్ద తట్టలో చాలా కమలాబలా పళ్ళు ఉన్నాయి. కొన్ని దానిమ్మ పళ్ళు కూడా ఉన్నాయి. ఎర్రని గింజలున్న రెండు దానిమ్మ పళ్ళని పువ్వుల ఆకారంలో కట్‌చేసి అందంగా అలంకరించాడు. సైకిల్ హ్యాండిల్‌కి వేలాడ గట్టిన రెండుబుట్టలు బరువుగా ఉన్నాయి. వాటిల్లో కూడా యాపిల్ పళ్ళు ఉన్నాయి. మధ్యాహ్నం నాలుగయ్యింది. బహుశా అది ఎవరూ పళ్ళు కొనే టైం కాకపోయి ఉండవచ్చు. ఒక్కరు కూడా ఆగి కొనడం లేదు. సైకిలు స్టాండ్ వేసి, పార్క్‌చేసి ఉన్న మోటారు్‌సైకిళ్ళ మధ్యనుంచి ఖాళీ చేసుకొని ప్లాట్‌ఫాం మీదకి వెళ్ళి అగరొత్తులకొట్టు వాడితో బాతాఖానీ వేశాడు. ఏమి మాట్లాడుకొంటున్నరో తెలియదు. వీడు బుర్రగొక్కుంటూ ఏదో అంటున్నాడు. కొట్టతను షాపులో సరుకులమీద పడిన దుమ్ము దులుపుకొంటూ సమాధానం చెపుతున్నాడు. 
మ్యాచింగ్ సెంటర్లోకి వెళ్ళిన మేడంగారు ఎప్పుడు తిరిగి వస్తుందో తెలియదు. అందుకే, ఏమీతోచక వాడిని గమనిస్తున్నాను. యుగాలనిరీక్షణ తరువాత ఆమె బయటికి వచ్చింది. ఈలోగా పళ్ళసైకిలువాడు అగరొత్తుల కొట్టువాడి దగ్గర అగ్గిపుల్ల తీసుకొని సిగరెట్ ముట్టించాడు. `ఏమీ దొరకలేదు. ఆ ముందుషాపుకి వెళదాం,` అంది. వెళ్ళాం. మళ్ళీ రోడ్డుప్రక్కన నిరీక్షణ మొదలైంది. జనాలు భీమాస్ హోటల్‌లోకి పోతున్నారు. బయటికి వస్తున్నారు. ఒక బట్టల షాపు ముందు చిన్న స్టూలు మీద కూర్చొని ఉన్న ఒక వ్యక్తి ప్లాట్‌ఫాం మీద పోతున్న ప్రతీ ఒక్కరినీ, `చాలా వెరైటీలు ఉన్నాయి, లోపలికి వెళ్ళి చూడండి,` అంటున్నాడు. చాలా మంది పట్టించుకోవడంలేదు. వెళ్ళాలనుకొన్న వాళ్ళు వెళుతున్నారు - ఖచ్చితంగా వాడి రికమండేషన్ విని మాత్రం కాదు. కిక్కిరిసిన మ్యాచింగ్ షాపుల్లోకి వెళ్ళలేక, లోపల ఉన్న వాళ్ళ, వాళ్ళ ఆడవాళ్ళకోసం బయట నాకులానే నిరీక్షిస్తున్న కొంతమంది ఉన్నారు. కష్టాలు ఎవరికైనా రావచ్చు :p ఆమె దగ్గారగా ఉన్నప్పుడు గంటలు, క్షణాల్లా గడిచిపోయినా; నన్ను బయటే వదిలేసి షాపింగ్ సెంటర్లోకి వెళ్ళినప్పుడు మాత్రం క్షణాలు, యుగాల్లా గడుస్తాయి. ఆమె షాపింగ్ ముగించుకొని బయటికి వచ్చింది. నా నిరీక్షణ పూర్తయ్యింది. 

బయలుదేరుతుండగా పళ్ళసైకిలు వాడు సిగరెట్‌కాల్చుకొంటూ, మమ్మల్ని  దాటుకొని కొంచెం ముందుకు వెళ్ళాడు. అక్కడ సైకిలు నిలుపుకొని ట్రాఫిక్ వైపు చూడడం మొదలుపెట్టాడు.  
© Dantuluri Kishore Varma 

Wednesday 25 December 2013

మీకునచ్చే ఇరవై విశేషాలు

సంవత్సరంన్నరక్రితం ఈ బ్లాగు మొదలుపెట్టినప్పటి నుంచీ మనకాకినాడకి సంబంధించిన ఎన్నో టపాలని రాయడం జరిగింది.   `మనకాకినాడలో` అనే పేరు చూసి, ఆశగా ఇక్కడికి వచ్చే పాఠకులు మన ఊరితోఉన్న మధురమైన అనుబంధం గురించి తలచుకొనేలా, జ్ఞాపకాలని గుర్తుతెచ్చుకొనేలా కొన్ని ఆర్టికల్స్ ఉండవచ్చు. కొత్తసంవత్సరం దగ్గర పడుతుంది కనుక అటువంటి వాటిల్లో ఆణిముత్యాల్లాంటి ఒక ఇరవై టపాలని ఎంచి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్రతీ ఆర్టికల్‌నీ సూచించే సబ్‌హెడ్డింగ్ పైన క్లిక్ చేస్తే పూర్తి టపాను చదవవచ్చు.  మరింత సమాచారం సేకరించి, ఇక్కడ పొందుపరచడానికి కావలసిన ఉత్సాహం మీ కామెంట్స్‌ద్వారా అందుతుందని గమనించండి. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. 


1. సండే మార్కెట్:


సండే మార్కెట్ అంటే…
పేదవాడి అన్ బ్రాండెడ్ బట్టల షాప్
మధ్య తరగతి షాపింగ్ మాల్
చిన్నపిల్లల తీర్తం
బుక్ లవర్ల స్వర్గం
స్రుజనాత్మక వస్తువులు అమ్మే బూటీక్
కార్లలో వచ్చి ఆగడానికి సిగ్గు పడే సంత

2. సర్పవరం శ్రీభావనారాయణ స్వామి దేవాలయం:


ఇక్కడ స్వయంభూగా వెలసిన పాతాళ భావనారాయణ స్వామికూడా ఉంది. ముగ్గురు మూర్తులున్న దీనిని త్రిలింగ క్షోణి వైకుంఠము అంటారు. శ్రీ కృష్ణదేవరాయల తండ్రి వసంతభోగరాయలు నిర్మించిన మండపం ఈ దేవాలయంలో ఉంది. ఈ విషయం ఇక్కడి శాశనాల వల్ల తెలుస్తుంది. ఈ క్షేత్రాన్ని దర్శించడంవల్ల 108 నారాయణ క్షేత్రాలు దర్శించిన ఫలితం వస్తుందని చెబుతారు.

3. గోకులం:


2 ఎకరాల విశాలమైన స్థలం
పచ్చని చేట్లు మరియు లాన్లు
దశావతారాలు, అష్టలక్ష్ములు
శ్రీకృష్ణ లీలలు, ధ్యాన మందిరం
సభావేదిక, చుట్టూ వాకింగ్ ట్రాక్
శ్రీకృష్ణ బృందావనం – మధురానగర్ లో గోకులం.

4. వాకలపూడి లైట్ హౌస్:


కాకతీయుల కాలం నుంచీ కాకినాడ ఒక ప్రధానమైన తీరప్రాంతంగా ఉండేదట. తరువాత ఈస్ట్ఇండియా కంపెనీ భారతదేశంలో వాణిజ్య కార్యకలాపాలు మొదలుపెట్టినప్పుడు, 19వ శతాబ్ధం మధ్యలో  రంగూన్ నుంచి, మచిలీపట్టణం వరకూ చాలా రేవు పట్టణాలలో ఆగుతూ వెళ్ళే స్టీమరు సర్వీసుని ఏర్పాటుచేసింది. మధ్యలో ఆగే రేవుపట్టణాలలో కోకనాడ ఒకటి. 

5. వ్యవసాయ, ఫల, పుష్ప ప్రదర్శన(ఎగ్జిబిషన్):


పదిరూపాయల టిక్కెట్టు కొని లోపలికి వెళితే ఏముంటుందో అందరికీ తెలుసు. ఇది మా వూరికి పెద్ద తీర్థం. 37 సంవత్సరాలనుంచి, పెద్దగా మార్పు లేకుండా అవేస్టాల్స్ పెడుతున్నా, కాకినాడలో సరదాగా కుటుంబంతో గడపడానికి కావలసిన  ప్రదేశాలు ఎక్కువగా లేవుకనుక, ప్రతీసారీ సినిమాకే పోలేకా ఎగ్జిబిషన్‌కి దారితీస్తారు మా నగరవాసులు. 

6. ఆదికుంభేశ్వర స్వామి దేవాలయము:


రావణా బ్రహ్మ రాజనీతిజ్ఞుడు, వీరుడు, బలశాలి, సకల వేదవేదాంగ పండితుడు అన్నింటినీమించి శివ భక్తుడు. ఎన్నో సుగుణాలు ఉన్నా, కొన్ని అవలక్షణాల వల్ల సర్వనాశనం కావడం మనం రావణుడి నుంచి నేర్చుకోవలసిన పాఠం. రావణాసురుని అసలు పేరు  దశగ్రీవుడు లేదా దశకంఠుడు. అంటే పదితలలు కలవాడు అని అర్ధం. నేను గొప్పవాడిని అన్న అహంతో శివుడు తప్పస్సు చేసుకొంటున్న పర్వతాన్ని కదిలించడానికి ప్రయత్నిస్తున్న రావణుడికి బుద్దిచెప్పడానికి శివుడు పర్వత శిఖరం మీద తనబొటనవేలితో అదుముతాడట. ఆ వొత్తడికి నలిగిపోయిన దశకంఠుడు బాధతో రోధిస్తాడట. అప్పటినుంచే అతనికి బాధతో రోదించేవాడని అర్ధం ఇచ్చే రావణుడు అని పేరు వచ్చింది అంటారు. ఆ సంఘటన తరువాత రావణుడు పరమ శివభక్తుడు అవుతాడు.   ఈ కథని గుర్తుకు తెచ్చేలా దశగ్రీవుడి తలలమీద నిలచిన శిఖరంతో ఆదికుంభేశ్వరుడి దేవాలయం మనకి కాకినాడ బీచ్‌రోడ్‌లో కనిపిస్తుంది. 

7. రాజా పార్క్:


రాజా పార్కుని మొదటిలో కుళాయి చెరువు అని పిలిచేవారు. నగరానికి నీటి అవసరాలని తీర్చే అతిపెద్ద చెరువు ఇది. విశాలంగా ఉన్న గట్టు మీద, చెరువు ప్రక్కన ఉన్న ఖాళీ స్థలంలో వ్యవసాయ ఫల పుష్ప ప్రదర్శన అని పిలవబడే ఎగ్జిబిషన్‌నీ ప్రతీసంవత్సరం నిర్వహించేవారు. ఇప్పుడు ఈ ఖాళీ స్థలాన్ని వేరుచేసి, చెరువు ప్రాంతాన్ని మాత్రం రాజా పార్క్(వివేకానందా పార్క్) గా అభివృద్ది చేశారు.  

8. ఇంకొక్క పెసరట్టు!:


కాకినాడ మెయిన్‌రోడ్ నుంచి జగన్నాధపురం వంతెనవైపుగా వస్తున్నప్పుడు, గోల్డ్‌మార్కెట్ సెంటర్ దగ్గర కుడిచేతివైపు మంత్రిప్రగడవారి వీధిలోనికి తిరిగి ముందుకు వెళ్ళండి. బాగా ముందుకి వెళితే దేవాలయం వీధికి వెళ్ళిపోతారు. వద్దు! అంతవరకూ వెళ్ళడం అనవసరం. కొంచెం నె...మ్మ...దిగా కదలండి. ఆ))) చూశారా, రోడ్డుకి రెండువైపులా వరుసగా బజ్జీ బళ్ళు, పిడతకింద పప్పు, రాజస్థానీవాళ్ళ పానీపూరీ, పావుబాజీ, చపాతీ బళ్ళు....వాటి దగ్గర బైకులమీద, స్కూటర్లమీద, సైకిళ్ళమీద, కార్లలో, నడిచీ వచ్చిన ఫాస్ట్‌ఫుడ్ ప్రియులు ఎంతోమంది ఆవురావురుమని మిరపకాయ బజ్జీలనీ, కళాత్మకంగా పానీపూరీల్నీ తినడం కనిపిస్తుందికదా?  నోరు ఊరుతుంది, అవునా? ఆగండాగండి. తొందరపడి ఎదో ఒకటి కొనేసుకోకండి. ఒక్క నాలుగడుగులు....

9. సీతారాముల గుడి:


ఈ దేవాలయంలో ఉన్న ఇంకొక విశేషం ఏమిటంటే శ్రీరామ పరివారపు ఉత్సవ విగ్రహాలు అన్నీ ఉన్నాయి. సాధారణంగా సీతారామలక్ష్మణులు, ఆంజనేయుడూ మాత్రమే ఉంటాయి. కానీ, భరతశతృగ్నులు, విభీషణుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు మొదలైన విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ విశేషం గురించి చెపుతూ వంశపారంపర్య అర్చకుడు ఇచ్చిన సమాచారం ఏమిటంటే - గుడిని నిర్మించే సమయంలో కాకినాడ సముద్రతీరంలో ఒక ఓడ ఒడ్డుకు చేరిపోయిందనీ, దానిలో దేవాలయానికి సంబంధించిన అర్చన సామాగ్రి సమస్తం ఒక భోషాణంలో ఉందని గుడిని నిర్మించినాయన స్వప్నంలో శ్రీరాముడు కనిపించి చెప్పాడట. వెళ్ళిచూస్తే నిజమే! పెట్టెలో ప్రస్తుతం గుడిలో ఉన్న శ్రీరామ పరవారం యొక్క విగ్రహాలు, పూజా సామాగ్రీ, గంటతో సహా లభించాయట. 

10. సినేమా:


హంస పాలనీ, నీళ్ళనీ విడగొట్టగలిగినట్టు వీళ్ళు భక్తినీ, రక్తినీ విడగొట్టారు. ఎలాగా అంటారా? టౌన్‌లో మెయిన్ రోడ్‌కి సమాంతరంగా అటుఒకటి, ఇటుఒకటీ రోడ్లు ఉంటాయి. ఒకదానిలో ఈచివరినుంచి, ఆచివరివరకూ ఎన్నో దేవాలయాలు ఉంటాయి. అందుకే దాన్ని దేవాలయం వీధి అంటాం. ఇక రక్తి విషయానికి వస్తే - దానికి కూడా ఒక ప్రత్యేకమైన రోడ్డు వుంది. ఇంతకు ముందు చెప్పాను కదా రెండుసమాంతరమైన రోడ్ల గురించి? ఆ రెండవదే జనాలకి వినోదం కలిగించేది. పేరు సినిమా వీధి. ఒకటి, రెండు సినిమా హాళ్ళు మినహా మిగిలినవన్నీ ఇదే వీధిలో ఉండేవి. అప్పటికప్పుడు అనుకొని సినిమాకి బయలుదేరినా, వరసగా థియేటర్లన్నీ ఒక్కొక్కటీ చూసుకొంటూ వెళితే, ఎక్కడో ఒకచోట టిక్కెట్లు దొరికేవి. 

11. పిండాల చెరువు దగ్గర త్రిపురసుందరి గుడి:


గుర్రపుడెక్కతో, తామరాకులతో అసలు నీరుందని కూడా తెలియనంతగా నిండిపోయి ఉండేది పిండాల చెరువు. అప్పుడప్పుడూ గుర్రపుడెక్క అంతా తొలగించి శుభ్రం చేసేవారు. కానీ, మధ్యలో ధ్యానముద్రలో ఉన్న శివుడి విగ్రహాన్ని కట్టి, చెరువు చుట్టూ గోడకట్టి, లోపల పార్క్ అభివృద్ది చేసిన తరువాత మొత్తం ఆ రోడ్డుకే అందం వచ్చింది.

12. జిల్లా కేంద్ర గ్రంధాలయం:


జిల్లాకేంద్ర గ్రంధాలయాన్ని 1952లో ప్రారంభించారు. కాకినాడ మెయిన్‌రోడ్‌లో ఉంది. పెద్దభవనం, విశాలమైన రీడింగ్‌రూంలు, మంచి ఫర్నీచర్, వివిధ సబ్జెక్టమీద 83,000 గ్రంధాలతో పుస్తకప్రియులని చేతులు చాచి ఆహ్వానిస్తుంది. 72 రకాల పత్రికలని తెప్పిస్తున్నారు. పోటీపరీక్షలకి వెళ్ళే విద్యార్ధులకి అవసరమైన వివిధరకాల పుస్తకాలను అందుబాటులో ఉంచారు. అంతే కాకుండా గంటకి కేవలం పదిరూపాయలు చెల్లించి అంతర్జాలాన్ని ఉపయోగించుకోగల సదుపాయంతో ఇంటర్నెట్ విభాగాన్ని కూడా నిర్వహిస్తున్నారు. 

13. మన కాకినాడ (అదే పదివేలు):


సముద్రపువొడ్డున ఉన్న పల్లె లాంటి పట్నం, పట్నం లాంటి పల్లె. అక్కడక్కడా నీటికొలనులు. వాటినిండా ఎర్ర తామర పువ్వులు. బాలాజీ చెరువు, సంతచెరువు, పిండాలచెరువు, కుళాయి చెరువు, ఇంకా చాలా చెరువులు వాటిపేర్లు కూడా మనకు తెలియకుండా కప్పెట్టేసినవి...

14. ఓ అందమైన అమ్మాయి ఆత్మకథ:


గోదావరి జిల్లాల ప్రజలు స్నేహశీలురు, గౌరవమర్యాదలు తెలిసున్నవాళ్ళు. అలాగని అమాయకులని మాత్రం అనుకోవడానికి వీలులేదు. `ఆయ్` అని మర్యాద చూపిస్తూనే, తమమర్యాద ఏమైనా తగ్గుతుందని భావిస్తే చమత్కారంగా మాటకి మాట అప్పజెప్పగల చతురులు. ఏ పరిస్థితులలో అయినా నెగ్గుకురాగల వ్యవహారధక్షత కూడా వీళ్ళకు ఎక్కువే. "ఏమిటి, గోదావరి వాళ్ళ వకాల్తా పుచ్చుకొన్నట్టు, అంతలేదు, ఇంతలేదు అని కోతలు కోస్తున్నావ్? వాళ్ళకేనా సుగుణాలు? ఇంకెవరికీ ఉండవా?" అని వాదనకి రావద్దు.

15. కాంక్రిట్ జంగిల్ లో జీవనవైవిధ్యం:


సెంట్రల్ జూ అధారిటీచే మినీ జూగా గుర్తింపబడిన కే.వీ.కే రాజు సుందరవనం ఎన్.ఎఫ్.సీ.ఎల్ గ్రీన్ బెల్ట్ లో ఉంది.

16. గాంధీ మందిరం:


గాంధీగారు కాకినాడ వచ్చిన సందర్భానికి గుర్తుగా 1950 లో గాంధీ మందిరం నిర్మించారు, తరువాత పాత భవనం స్థానంలో 2008లో ప్రస్తుతం ఉన్న భవనాన్ని నిర్మించారు.సాంబమూర్తి నగర్ ఓవర్ బ్రిడ్జికి దగ్గర, మునిసిపల్ ఆఫీస్ వెనుకవైపు `గాంధీ మందిరం` ఉంది.


17. స్టేట్ బ్యాంక్ హెరిటేజ్ గేలరీ: 


మెయిన్ రోడ్లో స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వెనుకవైపు (శ్రీకాంప్లెక్స్ రోడ్ లోకి వస్తుంది)2011 ఫిబ్రవరి 9న ఈబిల్డింగ్ లో స్టేట్ బ్యాంక్ హెరిటేజ్ గేలరీని ప్రారంభించింది.

18. సరస్వతీ విద్యా పీఠం:


ఋషి, పర్ణశాల, నిశభ్దం నీకూ నాకు మధ్య, ఆనందోబ్రహ్మ, ప్రేమ... లాంటి మంచి టేస్ట్ మరియు భావుకత్వం కలిపి రాసిన నావల్స్ యండమూరి వీరేంద్రనాధ్ యొక్క ప్రత్యేకతని తెలియజేస్తాయి. అదే ప్రత్యేకతతో ఆయన నెలకొల్పిన సరస్వతీ విద్యా పీఠం సామర్లకోట రోడ్డులో మాధవపట్నం దగ్గర ఉంది. 

19. కాకినాడ బీచ్‌:


సముద్రం నుంచి నేల వైపు చూస్తే గుబురుగా పెరిగిన సర్వీతోట, లైట్ హౌస్. కిలో మీటర్ల కొద్దీ వ్యాపించినట్టు కనిపిస్తున్న తీరం, ముఖ్యంగా కెరటాలు వచ్చి తాకుతున్న తడి ఇసుక, దానిమీద లంగరువేసి ఉన్న నావలు. తనివి తీరని అందాల్ని మాటల్లో వర్ణించాలంటే, ఎవరి గురించో చెప్పలేనుకానీ, నాకు మాత్రం సాధ్యంకాదు.

20. ఇంకా చాలా ఉన్నాయి


మన ఊరిలో విశేషాలకి కొదవలేదు. అందుకే, మనకాకినాడలో బ్లాగ్‌ని ఎల్లప్పుడూ చదువుతూ ఉండండి. మన ఊరితో మీకున్న అనుబంధాన్ని, మీ జ్ఞాపకాలని, అనుభూతులని కామెంట్ల రూపంలో ఇక్కడ అందరితో పంచుకోండి.

© Dantuluri Kishore Varma

Tuesday 24 December 2013

తిరుప్పావై పాశురాలు 9-22

9.పాశురము:

తూమణి మాడత్తుచ్చుట్రుమ్ విళక్కెరియ ధూపమ్ కమళ త్తుయిలణై మేల్ కణ్ వళరుమ్ మామాన్ మగళే ! మణిక్కదవమ్ తాళ్ తిరవాయ్ మామీర్! అవళై యెళుప్పీరో ఉన్ మగళ్ దాన్ ఊమైయో ? అన్రిచ్చెవిడో ? అనన్దలో ఏ మప్పెరున్దుయిల్ మన్దిరప్పట్టాళో ? మామాయన్ మాధవన్ వైకున్దన్ ఎన్రెన్రు నామమ్ పలవుమ్ నవిన్రేలో రెమ్బావాయ్

10.పాశురము:

నోట్రుచ్చువర్కమ్ పుహిగిన్రవమ్మనాయ్ మాట్రముమ్ తారారో వాశల్ తిరవాదార్ నాట్రత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్ పోట్రప్పరైత్తరుమ్ పుణ్ణియనాల్,పణ్ణొరునాళ్, కూట్రత్తిన్ వాయ్ విళన్ద కుమ్బకరుణనుమ్ తోట్రు మునక్కే పెరున్దుయిల్ తాన్ తన్దానో ? ఆట్రవనన్దలుడై యా యరుంగలమే తేట్రమాయ్ వన్దు తిరవేలో రెమ్బావాయ్

11.పాశురము:

కట్రుక్క ఱ వైక్కణంగళ్ పలక ఱన్దు శట్రార్ తి ఱలళియచ్చెన్రు శెరుచ్చెయ్యుమ్ కుట్రమొన్రిల్లాద కోవలర్తమ్ పొర్కొడియే పుట్రరవల్ గుల్ పునమయిలే పోదరాయ్ శుట్రత్తుతోళిమా రెల్లారుమ్ వన్దునిన్ ముట్రమ్ పుహున్దు ముగిల్వణ్ణన్ పేర్పాడ శిట్రాదే పేశాదే శెల్వప్పెణ్ణాట్టి ! నీ ఎట్రుక్కు రంగమ్ పొరుళేలో రెమ్బావాయ్.

12.పాశురము: 

కనైత్తిళం కట్రెరుమై కన్రుక్కిరంగి నినైత్తుములై వళియే నిన్రుపాల్ శోర, ననైత్తిలమ్ శేరాక్కుమ్ నర్ చెల్వన్ తంగాయ్ పనిత్తెలై వీళ నిన్ వాశల్ కడైపట్రి శినత్తినాల్ తెన్నిలజ్ఞ్గైక్కోమానైచెట్ర మనత్తుక్కినియానై ప్పాడవుమ్ నీవాయ్ తిఱవాయ్ ఇనిత్త నెళున్దిరాయ్ ఈదెన్న పేరుఱక్కమ్ అనైత్తిల్లత్తారు మఱిన్దేలో రెమ్బావాయ్

13.పాశురము:

పుళ్ళిన్ వాయ్ కీణ్డానై పొల్లావరక్కనై క్కిళ్ళి క్కళైందానై క్కీర్తిమై పాడిప్పోయ్ ప్పిళ్ళైగళెల్లారుమ్ పావైక్కళమ్ బుక్కార్ వెళ్ళి యెళున్దు వియాళ ముఱజ్ఞ్గిత్తు ప్పుళ్ళుమ్ శిలుంబినకాణ్ , పోదరిక్కణ్ణినాయ్ కుళ్ళక్కుళిరక్కుడైన్దు నీరాడాదే పళ్ళిక్కి డత్తియోపావాయ్ ! నీ నన్నాళాల్ కళ్ళమ్ తవిర్ న్దు కలన్దేలో రెమ్బావాయ్

వివరణ(ఇది లింకు. క్లిక్‌చేసి చదవండి).


14. పాశురము:

ఉజ్ఞ్గల్ పుళైక్కడై తోట్టత్తు వావియుల్ శెజ్ఞ్గళునీర్ వాయ్ నెగిలి న్దాంబల్ వాయ్ కూంబినకాణ్ శెజ్ఞ్గల్పొడిక్కూరై వెణ్ పల్ తవత్తవర్ తజ్ఞ్గల్ తిరుక్కోయిల్ శజ్ఞ్గిడువాన్ పోగిన్రార్ ఎజ్ఞ్గలై మున్న మెళుప్పువాన్ వాయ్ పేశుమ్ నజ్ఞ్గా యెలున్దిరాయ్ నాణాదాయ్ నావుడై యాయ్ శజ్ఞ్గొడు శక్కర మేన్దుమ్ తడక్కైయన్ పజ్ఞ్గయక్కణ్ణానై ప్పాడేలో రెమ్బావాయ్.

వివరణ(ఇది లింకు. క్లిక్‌చేసి చదవండి).
15. పాశురము:

ఎల్లే యిలంగిళియే ! యిన్నమురంగుడియో? శిల్లెన్రళై యేన్మిన్? నజ్ఞ్గైమీర్, పోదరుగిన్రేన్ వల్లై ఉన్ కట్టురైగళ్ పణ్డేయున్ వాయఱిదుమ్ వల్లీర్గళ్ నీజ్ఞ్గళే, నానేదా నాయుడుగ ఒల్లైనీ పోదాయ్, ఉనక్కెన్న వేఱుడైయై ? ఎల్లారుమ్ ఫోన్దారో? ఫోన్దార్, ఫోన్దెణ్ణిక్కొళ్ వల్లానై కొన్రానై మాత్తారై మాత్తళిక్క వల్లానై మాయనై ప్పాడేలో రెమ్బావాయ్.

వివరణ(ఇది లింకు. క్లిక్‌చేసి చదవండి).
16.పాశురము:

నాయగనాయ్ నిన్ర నన్దగోపనుడైయ కోయిల్ కాప్పానే ! కొడిత్తోన్రుమ్ తోరణ వాశల్ కాప్పానే ! మణిక్కదవమ్ తాళ్ తిరవాయ్ ఆయర్ శిరుమియరోముక్కు అరై పరై మాయన్ మణివణ్ణన్ నెన్నెలేవాయ్ నేర్ న్దాన్ తోయోమాయ్ వన్దోమ్ తుయిలెళప్పాడువాన్ వాయాల్ మున్నమున్నమ్ మాత్తాదే అమ్మా! నీ నేశ నిలైక్కదవమ్ నీక్కేలో రెమ్బావాయ్.

వివరణ(ఇది లింకు. క్లిక్‌చేసి చదవండి).
17.పాశురము:

అమ్బరమే , తణ్ణీరే శోఱే అఱమ్ శెయ్యుమ్ ఎమ్బెరుమాన్ ! నన్దగోపాలా! ఎళున్దిరాయ్, కొమ్బనార్కెల్లామ్ కొళున్దే ! కులవిళక్కే ఎమ్బెరుమాట్టి! యశోదాయ్! అఱివురాయ్! అమ్బర మూడఱుతోజ్ఞ్గి యులగలన్ద ఉమ్బర్ కోమానే ! ఉఱజ్ఞ్గాదెళున్దిరాయ్ శెమ్ పొర్కళ లడిచ్చెల్వా ! బలదేవా ! ఉమ్బియుమ్ నీయు ముఱజ్ఞ్గేలో రెమ్బావాయ్.

వివరణ(ఇది లింకు. క్లిక్‌చేసి చదవండి).
18. పాశురము:

ఉన్దు మదకళిత్త! నోడాద తోళ్వలియన్ నన్ద గోపాలన్ మరుమగళే ! నప్పిన్నాయ్ ! కన్దమ్ కమళుమ్ కుళలీ ! కడై తిరవాయ్ వన్దెజ్ఞ్గమ్ కోళి అళైత్తనకాణ్ మాదవి ప్పన్దల్ మేల్ పల్ కాల్ కుయిలి నజ్ఞ్గల్ కూవినగాణ్ పన్దార్ విరలి ! ఉన్ మైత్తునన్ పేర్పాడ చెన్దామరైక్కైయాల్ శీరార్ వళై యొళిప్ప వన్దు తిరువాయ్ మగిళిందేలొ రెమ్బావాయ్.

వివరణ(ఇది లింకు. క్లిక్‌చేసి చదవండి).


19.పాశురము:

కుత్తు విళక్కెరియ క్కోట్టుక్కాల్ కట్టిల్ మేల్ మెత్తెన్ర పఞ్చశయనత్తిన్ మేలేరి కొత్తలర్ పూజ్ఞ్గళల్ నప్పిన్నై కొంగైమేల్ వైత్తుక్కిడన్ద మలర్ మార్పా ! వాయ్ తిరవాయ్ మెత్తడజ్ఞ్కణ్ణినాయ్ నీ యున్మణాలనై ఎత్తనైపోదుమ్ తుయిలెళ ఒట్టాయ్ కాణ్ యెత్తనై యేలుమ్ పిరివాట్ర గిల్లాయాల్ తత్తువ మన్రుత్తగవేలో రెమ్బావాయ్.

వివరణ(ఇది లింకు. క్లిక్‌చేసి చదవండి).
20. పాశురము:

ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ శెన్రు కప్పమ్ తవిర్కుమ్ కలియే తుయిలెళాయ్ శెప్పముడైయాయ్ తిఱలుడైయాయ్ ! శెట్రార్కు వెప్పమ్ కొడుక్కుమ్ విమలా తుయిలెళాయ్ శెప్పన్న మెన్ములైచ్చెవ్వాయ్ చ్చిరు మరుంగుల్ నప్పిన్నై నంగాయ్ ! తిరువే ! తుయిలెలాయ్ ఉక్కముమ్ తట్టొళియుమ్ తన్దున్ మణాళనై ఇప్పోదే యెమ్మై నీరాట్టేలే రెమ్బావాయ్.

వివరణ(ఇది లింకు. క్లిక్‌చేసి చదవండి).
21.పాశురము:

ఏట్రకలంగ ళెదిరిపొంగి మీదళిప్ప మాట్రాదే పాల్ శొరియుమ్ వళ్లల్ పెరుమ్ పశుక్కల్ ఆట్ర ప్పడైత్తాన్ మగనే ! యరివురాయ్ ఊట్రముడై యాయ్ ! పెరియాయ్ ! ఉలగినిల్ తోట్రమాయ్ నిన్ర శుడరే ! తుయిలెళాయ్ మాట్రారునక్కు వలితులైన్దు ఉన్ వా శర్కణ్ ఆట్రాదు వన్దు ఉన్నడి పణియు మాప్పోలే పోట్రియామ్ వన్దోమ్ పుగళ్ న్దు ఏలోరెమ్బావాయ్.

వివరణ(ఇది లింకు. క్లిక్‌చేసి చదవండి).
22.పాశురము:

అంగణ్ మాజ్ఞాలత్తరశర్ అభిమాన బజ్ఞ్గమాయ్ నన్దు నిన్ పళ్ళిక్కట్టిల్ కీళే శజ్ఞ్గమిరుపార్ పోల్ వన్దుతలై ప్పెయ్ దోమ్ కింగిణివాయ్ చ్చెయద తామరప్పూప్పోలే శెంజ్ఞ్గణ్ శిరిచ్చిరిదే యేమ్మేల్ విళియావో తింగళు మాదిత్తియను మెళున్దార్పోల్ అజ్ఞ్గణ్ణిరణ్డుం కొండు ఎజ్ఞ్గళ్ మేల్ నోక్కుదియేల్ ఎజ్ఞ్గళ్ మేల్ చాబ మిళన్దేలో రెమ్బావాయ్.

© Dantuluri Kishore Varma 

Sunday 22 December 2013

అందమైన శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి గుడి

కాకినాడనుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో, యానం వెళ్ళేరోడ్డులో జామికాయలతూము ఉంది. అది ఒక ఊరిపేరు. అక్కడినుంచి కొంచెంలోపలికి వెళితే జి.వేమవరం ఊరిలోకి వెళతాం. అక్కడే శ్రీ జియర్‌స్వామి వారి ఆశ్రమం ఉంది. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరంగ రామానుజ జీయర్ స్వామివారిది ఇది. ఆశ్రమంతోపాటూ వేదపాఠశాల కూడా నిర్వహిస్తున్నారు. సుమారు ఆరు సంవత్సరాలక్రితం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని చాలా అద్భుతంగా నిర్మించారు ఇక్కడ.  

ఎత్తైన గాలిగోపురం, దానికి అభిముఖంగా ఉత్తరద్వార గోపురం, ఈ రెండింటికీ మధ్యలో గరుత్మంతుని మందిరం ఉన్నాయి. గాలిగోపురంలోనుంచి లోనికి ప్రవేశిస్తే, విశాలమైన ప్రదేశంలో వేంకటేశ్వరస్వామివారి దేవాలయము, ఎదురుగా ధ్వజస్థంభము, దానికి ఎడమవైపున శ్రీరంగ మండపము ఉన్నాయి.  

పదకొండు అడుగుల ఎత్తైన మందస్మిత వేంకటేశ్వరస్వామి వారి విగ్రహం చాలా బాగుంది. స్వామికి రెండువైపులా ప్రత్యేక మందిరాలలో ఆయన దేవేరులు ఉంటారు. 

గుడిని, పరిసరాలనీ చాలా పరిశుభ్రంగా ఉంచుతున్నారు. దేవాలయానికి చుట్టూ వనాన్ని పెంచుతున్నందువల్ల, ట్రాఫిక్‌కి చాలా.. దూరంగా ఉండడంవల్ల  ప్రశాంతతకు పట్టుకొమ్మలా ఉంటుంది. 








బాగుంది కదా? అవకాశం ఉంటే తప్పక చూడండి.
© Dantuluri Kishore Varma

Saturday 21 December 2013

అరకు బై ట్రెయిన్

అరకులోయకి ట్రెయిన్‌లో వెళ్ళారా ఎప్పుడైనా? విశాఖపట్నం నుంచి అరకు 132 కిలోమీటర్లు దూరం. అరకు వెళ్ళే రైలు మార్గాన్ని డి.బి.కే(దండకారణ్య, బాలంగీర్, కిరుఖురి)రైల్వే లైన్ అంటారు. కొత్తవలస - కిరుండుల్ లైన్ అనికూడా వ్యవహరిస్తారు. యాభై ఏళ్ళ క్రితం జపాన్‌వాళ్ళు వేశారట దీనిని. కొండలని తొలచి టన్నెల్స్ ఏర్పాటు చేశారు. సుమారు 44 టన్నెల్స్ ద్వారా రైలు ప్రయాణం సాగుతుంది. విజయనగరం జిల్లాలో ఉన్న శృంగవరపుకోట వరకూ మైదానప్రాంతం, తరువాత బొడ్డువార అనే వూరినుంచి కొండప్రాంతం మొదలవుతుంది. ఈ లైన్‌లో ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే అరకులోయకి సమీపంలో ఉన్న సిమిలిగుడ అనే రైల్వే స్టేషన్ సముద్రమట్టానికి 3268 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇదే భారతదేశంలో కెల్లా ఎత్తైన బ్రాడ్వే రైల్వే స్టేషన్! 
కొండలు, లోయలు, సెలయేర్లు, జలపాతాలు, పచ్చని ప్రకృతి మధ్యనుంచి మెల్లగా ప్రయాణించే రైలు - నాలుగు, ఐదు గంటల సమయం జీవితాంతం గుర్తుండిపోతుంది. 

కళ్ళల్లోనుంచి మనసులోనికి దారి ఉన్నట్టు, వెలుగులోనుంచి మొదలైన టన్నెల్ ఓ చీకటిని దాటి, అటుచివర మిరుమిట్లు గొలిపే మరొక వెలుతురు ద్వారాన్ని చేరుతుంది. టన్నెల్‌లోకి ప్రవేశిస్తుండగా వెలుగు మాయమై చీకటి వస్తుంది. ఏ.సీ. గదిలోకి ప్రవేశించినట్టు ఒక్కసారి టెంపరేచర్ తగ్గుతుంది. ఎక్స్‌కర్షన్‌కి వెళుతున్న స్టూడెంట్స్ గ్యాంగ్ ఒక్కసారిగా అరుపులు, కేకలతో అల్లరి చేస్తారు. రైలు చప్పుడుతో కలిసి హోరెత్తిపోతుంది. ఉరుకులెత్తి మహోగ్రంగా వచ్చిన సముద్రకెరటం ఒడ్డునుతాకి నెమ్మదించినట్టు ట్రెయిన్ టన్నెల్ లోనుంచి బయటకు వస్తుంది. 
ఆర్ట్‌గ్యాలరీ గోడలకి లేండ్‌స్కేప్ పెయింటింగ్స్ వరసగా వేలాడదీసినట్టు, అరకు వెళ్ళే దారిలో టన్నెల్, టన్నెల్ కీ మధ్యన ఒక సీనిక్ బ్యూటీ. చుట్టూ కొండలు. కొండవాలుల్లో మట్టి నిలబడి ఉండే చోటుల్లో మడులు కట్టి సాగుచేసే వ్యవసాయం. బకెట్లతో తెచ్చి పచ్చరంగుని కళ్ళాపి జల్లినట్టు లోయంతా అద్బుతమైన సోయగం. దట్టంగా పెరిగిన అడవి, కొడలపైనుంచి క్రిందికి జారే వాటర్‌ట్రేక్స్, ఎక్కడో తెలియని ఎత్తుల్లోనుంచి సన్నగా కురిసే జలపాతాలు, నీటిగలగలల్లో సంగీతం, వంతపాడే కోయిలగీతం.. ఆస్వాధించడానికి ఓ వందేళ్ళు సరిపోతాయా!? 
మరి అక్కడ ఉండేవాళ్ళు ఎలా ఉంటారో? పట్టణాలకి వెళ్ళి అక్కడే జీవితాంత గడపాలనుకొంటారా? ఏమో.. కానీ, ఉన్న నాలుగు మడుల వ్యవసాయం, కొన్ని గొర్రెలు, ఓ పూరి గుడిసే, చూట్టూ కొండలు, కొండల మధ్యలోనుంచి ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి నెమ్మదిగా సాగిపోయే రైలు బండి, మంచుని చీల్చుకొని ఉదయించే సూర్యబింబం, సాయంత్రం అస్తమిస్తున్న సూర్యుడి మీదనుంచి ఎగిరి వెళ్ళిపోయే ఓ కొంగలబారు, వంట దాలిలోనుంచి కొండల ఎత్తువరకూ సాగే కమ్మని పొగమేఘం - అరకులోయలో సుందర దృశ్యం. 

అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో అరకు సందర్శించడానికి మంచి టైం. ఇంకా అందమైన ప్రదేశాలు చూసిన వాళ్ళకి అరకు అత్యద్భుతంగా కనిపించక పోవచ్చు, కానీ, మనకి దగ్గరగా ఉన్న చక్కటి విహారస్థలం ఇది. 

© Dantuluri Kishore Varma

నాతో పందెం కాయకు!

ఈ రోజు నా పుట్టినరోజు. ఫ్రెండ్స్‌తో కలిసి చిన్న పార్టీ. ఫ్రెండ్స్ అంటే ఎదో పదిమందిమి కాదు. కేవలం ముగ్గురమే -సాయి, వీరేంద్రా, నేనూ. ఆనంద్ థియేటర్ ప్రక్కన ఉన్న పేస్ట్రీ షాపులో ఉన్నాం. తినేసి, తరువాత సినిమాకి పోవడం ప్రోగ్రాం.  

`చాలా కాలానికి కాకినాడ వచ్చావు. అదీ నీ పుట్టిన రోజు నాడు. మాకు చాలా ఆనందంగా ఉంది. నీ పుట్టినరోజు అని కాదురోయ్. నువ్వు ఇలా పార్టీ ఇవ్వడం బాగుందని,` అన్నాడు సాయి.

`నాన్నగారికి మళ్ళీ ఇక్కడికే ట్రాన్స్‌ఫర్ అయ్యింది. నిఖిల్ కాలేజీలో జాయినవుతున్నాను. రేపే,` అన్నాను. 

`అదంతా ఫేస్‌బుక్‌లో స్టేటస్ అప్డేట్ చేశావు కదరా? మళ్ళీ సోది ఎందుకు? మాకు తెలియంది ఏదయినా చెప్పు. లేదంటే, నీకు తెలియంది నేను చెపుతాను విను. నేనూ అదే కాలేజ్! మళ్ళీ మనిద్దరం క్లాస్‌మేట్స్ అవుతున్నాం. అహోయ్!` అన్నాడు వీరేంద్ర. 

`ఒరేయ్, ప్రాంక్స్(Pranks) ప్లేచేసి చాలా కాలం అయ్యింది. ఈ రోజు సరదాగా ఎవరినైనా ఆటపట్టించి, మాకు మంచి బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వాలి,` అన్నాడు వీరేంద్ర. అప్పటికే స్ప్రింగ్‌రోల్స్ తినేసి షాప్‌బయటికి వచ్చేశాం. వాడి దృష్టి థియేటర్‌కి ఎదురుగా పార్కింగ్ ప్లేస్‌లో స్విఫ్ట్‌ని పార్క్ చేసి క్రిందకి దిగుతున్న ఓ నలభై ఏళ్ళ వ్యక్తిమీద నిలిచి ఉండడం గమనించాను. 

`నేనే మీకు ఇవ్వాలా? అదేం కుదరదు. కావాలంటే పందెం కాయి,` అన్నాను. 

`వంద! అదిగో ఇప్పుడే ఆ కారు దిగిన అంకుల్‌ని ఆటపట్టించాలి నువ్వు,` అన్నాడు వీరేంద్ర.. సాయి నవ్వుతూ తమాషా చుస్తున్నాడు. ఇలాంటి పందాలు మాకు మామూలే. కాబట్టి వెంటనే అంగీకరించి ముందుకు నడిచాను.  

ఆయన దగ్గరకి వెళ్ళి `ఎక్స్యూజ్‌మీ, సర్,` అన్నాను. ఏమిటన్నట్టు చూశాడు. `నూకాలమ్మగుడికి ఎలా వెళ్ళాలో చెపుతారా?` అన్నాను. 

`ఈ వోవర్ బ్రిడ్జ్ దాటిన వెంటనే కుడిచేతి వైపుకి తిరిగి కొంచం ముందుకి వెళితే ట్రాఫిక్ ఐలెండ్ వస్తుంది. అది దాటిన వెంటనే కుడిచేతి వైపునే ఉంటుంది గుడి ,` అన్నాడు. అని ముందుకు నడిచాడు.

కొంచెం తటపటాయించినట్టు నటించాను. అతని వెనుకే రెండడుగులు వేసి, `సర్, మరోలా అనుకోకండి. మీరు చెప్పిన ఎడ్రస్ కరెక్టే కదా?` అన్నాను.

`వాట్ డు యూ మీన్?` అన్నాడు.

`అది కాదు సర్, ఇప్పుడే ఇంకొకాయనని అడిగాను. ఆయన మీరు చెప్పిన దానికి ఆపోజిట్ డైరెక్షన్ చూపించాడు.` 

`అతనికి ఊరు కొత్త అయి ఉంటుంది,` అన్నాడు.

`ఆయన తెలివైన వాడిలా కనిపించాడు. కాబట్టే నమ్మాలనిపిస్తుంది.`

`నమ్మాలనిపిస్తే నమ్మి వెళ్ళలేక పోయావా? నన్నెందుకు మళ్ళీ అడగడం? ఇప్పుడు నేను అతనంత తెలివిగా కనిపించడం లేదా?` అన్నాడు కోపంగా, `కానీ, ఇది తెలివితేటల సమస్యకాదు. నూకాలమ్మ గుడికి అలాగే వెళ్ళాలి.` 

`నూకాలమ్మ గుడికి దారి ఎవరు అడిగారు మిమ్మల్ని? మీరు కన్‌ఫ్యూస్ అయినట్టున్నారు. నేను అడిగింది భానుగుడికి దారెటని,` అన్నాను. నాకు నవ్వు ఆగటంలేదు. నా పెదవులమీద అణిచిపెట్టుకొంటున్న కొంటెనవ్వుని అతను గమనించాడు. `ఈడియట్,` అని వడివడిగా వెళ్ళిపోయాడు.   

దూరంగా నుంచుని తమాషా చూస్తున్న నా ఫ్రెండ్స్ దగ్గరకి విజయగర్వంతో వెళ్ళాను. వీరేంద్ర వోటమి ఒప్పుకొన్నట్టు నాచేతిలో వందరూపాయలు పెట్టాడు. 

`నాతో ఎప్పుడూ పందెం కాయకు,` అన్నాను.

`నాతో కూడా కాయకు. ఎందుకంటే, నువ్వు రేపు జాయినవ్వబోతున్న నిఖిల్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆయన. అంటే, మన ప్రిన్సీ!` అన్నాడు వీరేంద్ర . 
© Dantuluri Kishore Varma 

Friday 20 December 2013

కురుస్తున్న మంచూ, ఉడుకుతున్న పొత్తులూ.. ఇంకా చాలా...

Not my own pic. Taken from the web. Thanks to the photographer.
మంచుకురుస్తున్నప్పుడు కారులో ప్రయాణం చేస్తే చాలా బాగుంటుంది కదా? 
ఆ మాటకి వస్తే బస్సులో ఐనా సరే బాగానే ఉంటుంది.  
రోడ్డుకి రెండువైపులా పెరిగిన చెట్ల పైకొమ్మలు ఆర్చిల్లా వొంపుతిరిగి స్వాగతద్వారాల్లా కనిపిస్తాయి. 
వరిచేలుకోసి, పనలు ఆరబెట్టి, కుప్పలు నూర్చి, ధాన్యాన్ని రైసుమిల్లుకి తోలేసిన తరువాత, వరిగడ్డిని కుప్పలు వేస్తారు. రహదారికి ఇరువైపులా పంటకోసిన పొలాల్లో, మంచులో తడిసి పోతున్న వాటిని చూస్తుంటే తెల్లవారు జామున నిశ్చలంగా తపస్సుచేసుకొంటున్న మహా మునులు జ్ఞాపకం వస్తారు. 
అక్కడక్కడా కనిపించే గుడిగోపురాలు...
ఎటువంటి హడావుడీ లేకుండా మంద్రగతిన సాగిపోతున్న ఎడ్లబళ్ళ సోయగాలు. లయబద్దంగా ఊగుతున్నఎడ్లమెడల్లో కట్టిన  గంటలు. 
గోచీలు బిగించి కట్టి, నెత్తిమీద కట్టెల మోపుతో ఇళ్ళవైపు వెళుతున్న పల్లె పడుచులు...   
ఇవన్నీ చూసుకొంటూ, ఏ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానిదో పాత మెలోడీ వింటూ అలా, అలా ఎంతసేపైనా సాగిపోవచ్చు. 

కానీ, ఇక్కడొక చిక్కు వుంది. మీరు పిఠాపురం మీదుగా వెళుతుంటే రెండు, మూడు చోట్ల మీరు చూసే దృశ్యాలు మిమ్మల్ని ముందుకు పోనివ్వవు. ఆగి తీరవలసిందే! మూడురాళ్ళ కట్టెలపొయ్యిమీద పెద్ద డేగిశా(పాత్ర)లో కుతకుతమని మరుగుతున్న నీళ్ళూ, వాటిలో మొక్కజొన్నపొత్తులు... కార్న్ ఉడుకుతుంటే వచ్చే కమ్మని వాసన ఎప్పుడైనా చూశారా? ఇరెసిస్టబుల్! మీ నోటిలో నీళ్ళు ఊరడం ఖాయం! అందులోనూ ఉడుకు తున్నవి, రుచికి ప్రశిద్ది చెందిన పిఠాపురం పొత్తులైతే మరీనూ!  ఇరవై రూపాయలకి మూడు ఇస్తాడు, కాదంటే పదిరూపాయలకి రెండు. బేరం ఆడి, కుదరక వదిలేసి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళిపోవద్దు. తరువాత చాలా చింతించాల్సి వస్తుంది. ఆ ప్రక్కనే కనిపిస్తున్న తంపటివేసిన, లేదా కాల్చిన తేగలు కనిపించినా ఒక కట్ట కొనుక్కోండి. 

ప్రయాణం చేస్తున్నప్పుడు కేవలం మైలు రాళ్ళే కనిపిస్తున్నాయంటే, ఆ జర్నీ చాలా విసుగ్గా ఉందని అర్థం. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాం అని కాదు, ఎన్ని మంచి విషయాలు మనసుపొరల్లో జ్ఞాపకాలుగా మిగల బోతున్నాయి అనేదే ముఖ్యం. అది రోడ్డు మీద ప్రయాణమైనా, జీవిత ప్రయాణమైనా! 

అయ్యబాబోయ్, ఇలా ఫిలాసఫీ వొచ్చేస్తుందేమిటీ! 

© Dantuluri Kishore Varma 

Thursday 19 December 2013

తిరుప్పావై - 5,6,7,8 పాశురాలు

ధనుర్మాసం మొదలైనతరువాత తిరుమలలో సంవత్సరం పొడవునా అనునిత్యం ఉదయాన్నే జరిగే సుప్రబాతసేవని నిలిపివేసి, దానికి బదులుగా తిరుప్పావై పాశురాలని మొదలుపెట్టారు. విష్ణాలయాలలో అన్నిచోట్లా ఇటువంటి సాంప్రదాయమే ఉంది. ఈ బ్లాగ్‌లో (లింక్ ఇక్కడ) ఇంతకు ముందు ఇచ్చిన మొదటి నాలుగు పాశురాలకి కొనసాగింపుగా, ఈ టపాలో ఐదు నుంచి ఎనిమిది వరకూ పాశురాలని ఇవ్వడం జరిగింది. విని, చదివి, అర్థంచేసుకొని, ఆస్వాదించండి. (Youtube Link)

5.పాశురము:

మాయనై మన్ను, వడమదురై మైన్దనై త్తూయ పెరునీర్ యమునై త్తురైవనై ఆయర్ కులత్తినిల్ తోన్రుమ్ మణి విళక్కై త్తాయైక్కుడల్ విళక్కమ్ శెయ్ద దామోదరనై తూయోమాయ్ వన్దునామ్ తూమలర్ తూవిత్తొళుదు వాయినాల్ పాడి, మనత్తినల్ శిన్దిక్క పోయపిళ్ళైయుమ్ ప్పుగుదరువా నిన్రనవుమ్ తీయినిల్ తూశాగుం శెప్పేలో రెమ్బావాయ్

వివరణ(ఇది లింకు. క్లిక్‌చేసి చదవండి).

6.పాశురము:

పుళ్ళుమ్ శిలుంబినకాణ్ పుళ్ళరయ్యన్ కోయిలిల్ వెళ్ళై విళిశంగిన్ పేరరవమ్ కేట్టి లైయో పిళ్ళా యెళుంది రాయ్ పేయ్ ములై నంజుణ్డు కళ్ళచ్చగడం కలక్కళియ క్కాలోచ్చివెళ్ళత్తరవిల్ తుయిల మర్ న్ద విత్తినై ఉళ్ళత్తు క్కొండు
మునివర్గళుమ్ యోగిగళుమ్ మెళ్ళ వెళున్దు ఆరియన్ర పేరరవమ్ ఉళ్ళమ్ పుగున్దు కుళిర్ న్దేలో రెమ్బావాయ్.

వివరణ(ఇది లింకు. క్లిక్‌చేసి చదవండి).
7.పాశురము:

కీశు కీశెన్రెజ్ఞ్గుమానై చాత్తకలన్దు ! పేశిన పేచ్చరవమ్ కేట్టిలైయో ! పేయ్ ప్పెణ్ణే ! కాశుమ్ పిరప్పుమ్ కలగలప్పక్కై పేర్తు వాశ నరుజ్ఞ్గుళ లాయిచ్చియర్ మత్తినాల్ ఓశై పడుత్త తయిర రవమ్ కేట్టిలైయో నాయకప్పెణ్ణిళ్ళాయ్ ! నారాయణన్ మూర్తి కేశావనై ప్పాడవుమ్ నీకేట్టే కిడత్తియో తేశ ముడైయాయ్ ! తిర వేలో రెమ్బావాయ్.

వివరణ(ఇది లింకు. క్లిక్‌చేసి చదవండి).

8.పాశురము:

కీళ్ వానమ్ వెళ్ళెన్రు ఎరుమై శిరువీడు మేయ్ వాన్ పరన్దనకాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్ పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తున్నై కూవువాన్ వన్దు నిన్రోమ్ కోదుకలముడైయ పావాయ్ ! ఎళున్దిరాయ్ పాడిప్పరైకొణ్డు మావాయ్ ! పిళన్దానై మల్లరై మాట్టియ దేవాదిదేవనై చ్చెన్రునామ్ శేవిత్తాల్ ఆవావెన్రా రాయ్ న్దరుళేలో రెమ్బావాయ్.

వివరణ(ఇది లింకు. క్లిక్‌చేసి చదవండి).

తిరుప్పావై మిగిలిన పాశురాలని ఇక్కడ వినండి:

  1. తిరుప్పావై - మొదటి నాలుగు పాశురాలు
  2. తిరుప్పావై - 9 - 22 పాశురాలు
  3. తిరుప్పావై పాశురాలు 23 - 30 
© Dantuluri Kishore Varma

Wednesday 18 December 2013

శీతాకాలం సాయంత్రం....

శీతాకాలం సాయంత్రం అలా మెయిన్‌రోడ్‌లోకి వాకింగ్‌కి వెళ్ళి చూడండి, ఎంత బాగుంటుందో! 
అయిదున్నర అయ్యేటప్పటికే చలి మొదలైపోతుంది. 
నిమిషనిమిషానికీ చీకటి చిక్కబడిపోతుంది.
మంచుతెర పట్టణమ్మీద పరుచుకొంటుంది.
విద్యుత్ లైట్ల వెలుగులు ఆ పరదాలని చిల్చుకొని తొంగిచూడాలని ఆరాట పడతాయి. 
జర్కిన్లు, స్వెట్టర్లు వేసుకొని షాపులదగ్గర కొనేవాళ్ళు,
వేడివేడి టీని ఊదుకొని తాగేవాళ్ళు, 
తలపాగాలో, మఫ్లర్లో చుట్టుకొని తోపుడుబండి దగ్గర అమ్మేవాళ్ళు,
మునిసిపాలిటీ ఎండుచెత్తతో చలిమంట వేసుకొని దానిచుట్టూ కూర్చొనే రిక్షావాళ్ళు 
స్నానంచేసి చక్కగా తయారయి గుడికో, పురాణకాలక్షేపానికో వెళ్ళే భక్తులు
మంచు కురిసే అందాల్ని చూడాలంటే ఉదయంపూట పల్లెటూరిలో, రాత్రి పూట పట్టణాలలో చూడాలి. ముఖ్యంగా ఏమయినా సంబరాలు జరిగేటప్పుడైతే మరీ బాగుంటుంది. మావూరు పేరుకి పట్టణమే కానీ, నిజానికి పెద్ద పల్లెటూరు లాంటిది! 
నిన్న రాత్రి తొమ్మిది అయ్యింది...
మెయిన్‌రోడ్ నుంచి డప్పులు, సందడి వినిపిస్తుంది.
`హనుమంతుడి ఊరేగింపు వెళుతుంది, వెళ్ళి చూసొద్దాం,` అంది మా చిన్నమ్మాయి.
వెళ్ళాం!
హనుమాన్ జయంతోత్సవాలు జరుగుతున్నాయి కదా? ఉత్సవ విగ్రహాన్ని ఊరేగిస్తున్నారు. వాహనానికి ముందు బాలహనుమంతుల హల్‌చల్ చేస్తున్నారు. గరగ నృత్యాలు, కోలాటాలు... అబ్బో చాలా సందడిగాఉంది. 


మెయిన్‌రోడ్‌లో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది.  వీలయినంతవరకూ ప్రక్కరోడ్లలోకి తిరిగిపోయి ఏసువారి వీధికి కలిసిపోతున్నారు. అక్కడినుంచి మునసబుగారి జంక్షన్‌కి చేరుకోవచ్చు. 

దీనిలో కొసమెరుపు ఏమిటంటే, మావీధిలోకి తిరిగిన బస్సుల్లో ఒకటి మాయింటికి వచ్చే ఇంటర్నెట్ కేబుల్ని కట్ చేసుకొని పోయింది. అదిగో అప్పుడు పోయిన కనెక్షన్, ఇప్పటికి వచ్చింది!
© Dantuluri Kishore Varma

Sunday 15 December 2013

గోదాదేవి తిరుప్పావై

తమిళనాడు, కేరళ సరిహద్దుల్లో మదురైకి 75కిలోమీటర్ల దూరంలో కొండలనుడుమ శ్రీవిల్లిపుత్తూరు అనే ఊరిలో రంగనాధస్వామి దేవాలయం 108 గొప్ప విష్ణుక్షేత్రాలలో ఒకటి.  సుమారు ఎనిమిదవ శతాభ్దపు కాలంలో(A.D.) దేవాలయ ప్రధాన అర్చకుడిగా ఉన్న విష్ణుచిత్తుడికి పూలతోటలో ఒక పసిపాప దొరికింది. ఆమే ఆండాళ్. విష్ణుచిత్తుడు పెంచుకొన్నాడు.

ఆండాళ్ గొప్ప విష్ణుభక్తురాలు. అప్పటి ఆచారం ప్రకారం బాల్యవివాహం చేయ సంకల్పిస్తే నిరాకరించింది. మనసునిండా పాండురంగడిని  నింపుకొని, ఆయననే పరిణయమాడాలని తలచింది. తండ్రి ప్రతీరోజూ రంగనాధునికి అలంకరించడానికి పూమాలను తయారుచేస్తే, ముందు తానే ధరించేది. కొన్నిరోజులకు ఆ విషయం విష్ణూచిత్తుడికి తెలిసి ఆమెని మందలిస్తాడు. ఆమె ధరించిన మాలని విడిచి పెట్టి, మరొకటి అల్లి, రంగనాధుడికి సమర్పిస్తాడు. కానీ పాండురంగడికి అది నచ్చక ముఖం చిన్నబుచ్చుకొన్నాడట. తనకి ఆండాళ్ ధరించిన మాలనే అలంకరించమని ఆదేశించాడట.  


యుక్తవయస్సు వచ్చేసరికి పాండురంగడిని పరిణయమాడాలని వ్రతం చేసింది. దీనిలో భాగంగా ముప్పై పాశురాలు రచించి, రోజుకి ఒకటి చొప్పున పాడుతూ తిరుప్పావై వ్రతం చేసింది.  ముప్పయ్యవరోజు పాండురంగడు, ఆండాళ్‌ని వివాహంచేసుకొన్నాడట. ఆరోజునే బోగి అంటారు. ఆండాళ్‌నే గోదాదేవి అని కూడా అంటారు. ఆమె తమిళంలో రాసిన ముప్పై పాశురాలని కలిపి తిరుప్పావై అంటారు.  

పండుగనెల(ధనుర్మాసం) ప్రారంభమైన రోజునుంచి (ఈ సంవత్సరం ధనుర్మాసం రేపు అంటే పదహారవ తేదీన ప్రారంభమౌతుంది) గోదాదేవి పాడిన పాశురాలని రోజుకొకటి చొప్పున విష్ణుక్షేత్రాల్లో వినిపిస్తారు.  వాటిని వినడం వల్ల, పాడడంవల్ల విశేషమైన పుణ్యం లభిస్తుందని చెపుతారు.
*     *     *
మార్గశిర మాసం. విష్ణాలయాలు భక్తి, ఆధ్యాత్మికతలతో శోభాయమానం అయ్యే కాలం ఇది. ముగ్గులతో, పుష్పాలతో దేవాలయాలని అలంకరిస్తారు. తిరుప్పావై పాశురాలని ఆలపిస్తారు. వివరణలు చెపుతారు. మంచుకురిసే వేళల్లో ఆ అలంకారాలను చూడడం, పాశురాలని వినడం ఎంతో బాగుంటుంది.

గోదాదేవి ఆలపించిన పాశురాలన్నీ తమిళంలో ఉన్నాయి. వాటిని యధాతదంగా గానం చేస్తారు. తెలుగు లిపిలో రాసుకొన్నా, తమిళభాష రాని నాలాంటి వారికి వాటిని చదవడం ఇబ్బంది. అర్థం తెలియదు. ఇక శృతిలో పాడుకోవడమంటే ఈ జన్మలో అయ్యే పనికాదు. కానీ, విజ్ఞులు అందరూ తిరుప్పావైలో ఉన్న మప్పై పాశురాల గొప్పతనం గురించి చెపుతుంటే చదవి అర్థం చేసుకోవాలని మనసు లాగుతుంది. 

నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. బహుశా వాళ్ళకోసమేమో, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఎప్పుడో 2000వ సంవత్సరంలో పాశురాలకి ఇంగ్లీషులో వివరణ జతచేసి ఒక చిన్న బుక్‌లెట్ విడుదల చేశారు. చక్కని బొమ్మలు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇంటర్నెట్ సౌలభ్యం కారణంగా యూట్యూబ్ వీడియోలు చూడగలగడం, ప్రవచనాలు వినగలగడం చేస్తున్నాం. 

ధనుర్మాసం మొదలైంది కనుక వాటన్నింటినీ అనుసంధానం చేసుకొంటే ఆండాళ్ రోజుకొక్కటిగా పాడిన పాశురాలన్నీ, మనం కూడా రోజుకొక్కొక్కటి వింటూ, అర్థం చేసుకొంటూ ఆస్వాదించవచ్చు! నిత్యశ్రీ మహదేవన్ అనే గాయని తమిళ్‌లో పాడిన పాశురాలని నాలుగు, ఐదు వాటిగా కలిపి యూట్యూబ్‌లో ఉంచారు. మొదటి నాలుగు పాశురాల వీడియోని ఇక్కడ ఇస్తున్నాను. వీడియోకి క్రింద తెలుగు లిపిలో ఉన్న పాశురాలు, వాటికి క్రింద శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు తిరుప్పావై గురించి వివరంగా చెప్పిన ప్రవచనాల లింకు ఇస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ బుక్‌లెట్‌లో ఇచ్చిన బొమ్మలు కూడా ఉన్నాయి. 



1.పాశురము

మార్గళి త్తిజ్ఞ్గల్ మది నిరైన్ద నన్నాళాల్ 
నీరాడ ప్పోదువీర్, పోదుమినో నేరిలైయీర్ 
శీర్ మల్గుమ్ ఆయ్ ప్పాడి శెల్వచ్చిరు మీర్ కాళ్ 
కూర్వేల్ కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్ 
ఏరార్ న్ద కణ్ణి యశోదై యిళంశింగమ్ 
కార్మేనిచ్చజ్ఞ్గణ్ కదిర్మదియం బోల్ ముగత్తాన్ 
నారాయణనే నమక్కే 
పరైతరువాన్ పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్

వివరణ(ఇది లింకు. క్లిక్‌చేసి చదవండి).
2.పాశురము

వైయత్తు వాళ్వీర్గాళ్ నాముమ్ నమ్బావైక్కు 
చ్చెయ్యుమ్ కిరిశైగళ్ కేళీరో పార్కడలుళ్ 
పై యత్తు యిన్ర పరమనడిపాడి 
నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి 
మైయిట్టెళుదోమ్ మలరిట్టు నాముడియోమ్ 
శెయ్యాదన శెయ్యోమ్ తీక్కురళై చ్చెన్రోదోమ్ 
ఐయ్యముమ్ పిచ్చైయుమ్ ఆన్దనైయుమ్ కైకాట్టి 
ఉయ్యు మారెణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్.

వివరణ(ఇది లింకు. క్లిక్‌చేసి చదవండి).
3.పాశురము.

ఓంగి యులగళన్ద ఉత్తమన్ పేర్పాడి 
నాంగళ్ నమ్బావైక్కు చ్చాట్రి నీరాడినాల్ 
తీంగన్రి నాడెల్లామ్ తింగళ్ ముమ్మారి పెయ్ దు 
ఓంగు పెరుమ్ శెన్నెల్ ఊడు కయలుగళ 
పూంగువళై పోదిల్ పొరివణ్డు కణ్పడుప్ప 
తేంగాదే పుక్కిరున్దు శీర్ త్తములై పట్రి 
వాంగక్కుడమ్ నిరైక్కుమ్ వళ్ళల్ పెరుమ్బశుక్కళ్ 
నీంగాదశెల్వమ్ నిరైన్దేలో రెమ్బావాయ్.

వివరణ(ఇది లింకు. క్లిక్‌చేసి చదవండి).
4.పాశురము

ఆళిమళైక్కణ్ణా ! ఒన్రు నీకై కరవేల్ 
ఆళియుళ్ పుక్కు ముగున్దు కొడార్తేరి 
ఊళిముదల్వ నురువమ్పోల్ మెయికరుత్తు 
పాళియందోళుడై పర్పనాబన్ కైయిల్ 
ఆళిపోళ్ మిన్ని, వలమ్బురి పోల్ నిన్రదిరిన్దు 
తాళాదే శార్ జ్ఞ్గముదైత్త శరమళైపోల్ 
వాళవులగినిల్ పెయ్ దిడాయ్ నాంగళుమ్ 
మార్గళి నీరాడ మగిళిన్దేలో రెమ్బావాయ్

వివరణ(ఇది లింకు. క్లిక్‌చేసి చదవండి).

తిరుప్పావై మిగిలిన పాశురాలని ఇక్కడ వినండి:

  1. తిరుప్పావై - 5,6,7,8 పాశురాలు
  2. తిరుప్పావై - 9 - 22 పాశురాలు
  3. తిరుప్పావై పాశురాలు 23 - 30 
© Dantuluri Kishore Varma 

Saturday 14 December 2013

అన్నిదారులూ అక్కడికే...

సాయంత్రం స్కూల్‌నుంచి ఇంటికి వెళుతుంటే తెలుసున్న ఆసామి ఒకరు `అక్కడికేనా?` అని అడిగారు. `కాదండి, ఇంటికివెళ్ళి, ఆతరువాత అక్కడికి వెళతాను. ఇంతకీ ఎప్పుడు మొదలవుతుంది?` అన్నాను. ఆయన టైం చెప్పారు.

బండి పార్క్‌చేసి ఇంటిలోకి వెళుతుంటే, పక్కింటవిడ ఎవరితోనో గట్టిగా ఫోన్‌లో మాట్లాడటం వినిపిస్తుంది. `రోజూ ఉండే పనులే కదా? ఇంటిలో ఎవరూ లేకపోయినా పరవాలేదు. తాళాలు వేసుకొని వచ్చెయ్యి,` అని. అక్కడికే అని అర్థమౌతుంది. 

మాయింటికి కూతవేటు దూరంలో విష్ణాలయం ఉంది. దానికి అభిముఖంగా ఆంజనేయస్వామి గుడి. రెండింటినీ విద్యుత్‌బల్బుల వెలుగులతో అలంకరించారు. వారికీ, వీరికీ స్వాగతం అని బ్యానర్లు కట్టారు. విష్ణాలయం బయట చాలా వాహనాలు నిలిపి ఉన్నాయి. ప్రవేశద్వారానికి అటూ, ఇటూ ఆలయంలోనికి అప్పటికే వెళ్ళిన భక్తుల చెప్పులు విడిచి పెట్టి ఉన్నాయి. చూస్తూ ఉంటే చాలా మంది ఉన్నట్టున్నారు. 

మైకులోనుంచి గంభీరమైన స్వరం వినిపిస్తుంది. గంభీరంగా ఉన్నా శ్రావ్యంగా ఉంది. హనుమంతుడు లంకలో ఎవరితోనో యుద్దం చేస్తున్న ఘట్టం వినిపిస్తున్నారు. హనుమంతుని ప్రత్యర్ధి మరెవరో కాదు స్వయంగా ఆతని కుమారుడే. మకరధ్వజుడు. ఎలా జన్మించాడో చెప్పే వాల్మీకి రామాయణంలోని కథ, ఆ తరువాత మకరధ్వజుని సహాయంతో మైరావణుని సంహారం...కథా ప్రవాహం జరిగిపోతుంది. 
విష్ణాలయంలో వెనుకవైపు ఉన్న కళ్యాణ మండపం దగ్గరనుంచి, గుడివరకూ ఖాళీ స్థలంలో వేసిన కుర్చీలు అన్ని నిండి పోయాయి. వాటివెనుక చాలామంది కటిక నేలమీదే కూర్చుని వింటున్నారు. వాళ్ళకి ఇంకా వెనుక చాలా మంది నుంచొని ఉన్నారు. ప్రవచనం ఇంకొక గంటన్నర ఉండవచ్చు. అప్పటివరకూ ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండిపోవడానికి నిర్ణయించుకొన్నట్టున్నారు. చెవులు ఒక్కటే బాగా పనిచేస్తున్నాయి. ప్రవచనం చెపుతున్నాయనా కథలోనుంచి కథ, సన్నివేశంలోనుంచి సన్నివేశం అల్లుకొని పోతున్నారు. మధ్యమద్యలో పద్యాలు, శ్లోకాలు, ఉపమానాలు, వివరణలు, పుణ్యక్షేత్రాల వివరాలు, వాటికీ, చెపుతున్న కథకీ ఉన్న సంబందం. శ్రోతలు ఆ ప్రవాహంలో కొట్టుకొని పోతున్నారు. పోతే పోనివ్వండి! మహా అయితే ఇంకొక నాలుగు రోజులు. మళ్ళీ వచ్చే సంవత్సరంవరకూ ఇక్కడివాళ్ళకి స్వయంగా వినే ఇలాంటి అవకాశం వస్తుందో, లేదో!  

చెపుతున్నాయన మరొకరు ఎవరో అయితే ఈ సాయంత్రం అన్నిదారులూ అక్కడికే వెళ్ళి ఉండేవి కాదు. ఆయన స్వయానా ప్రవచన చక్రవర్తి! 

ఇంతకీ ఆయన ఎవరో మీకు తెలిసిందా? తెలిస్తే చెప్పండి మరి. 

© Dantuluri Kishore Varma 

Friday 13 December 2013

మీరు పెర్‌ఫెక్టా, ఇంపెర్‌ఫెక్టా?

`నేను ప్రతీవిషయంలోనూ ఖచ్చితంగా ఉంటాను,` అనుకొంటూ ఉంటారు కొంతమంది.అలా ఉండాలనుకోవడంలో తప్పులేదు. కానీ, మిగిలిన వాళ్ళు అందరూ తమలాగే ఉండాలనుకొంటేనే సమస్యలు వస్తాయి. 

ఒక పెద్దాయన ఆర్థిక విషయాలలో చాలా నిక్కచ్చిగా ఉండేవాడు. బ్యాంకుల నుంచి వ్యాపారంకోసం తీసుకొన్న లోన్లుమీద  వడ్డీని సరిగ్గా ఒకటవ తారీకున కట్టేవాడు. కరంటు బిల్లులు, ఫోను బిల్లులు, అద్దులు అన్నింటిలోనూ అంతే! తనకి రావలసిన బాకీల విషయంలో కూడా అలాగే అనుకొన్నా, బాకీ ఉన్నవాళ్ళు అతనంత నిబద్ధత ఉన్నవాళ్ళు కాక, లేదంటే సమయానికి డబ్బులు సర్దుబాటు కాక ఎప్పుడూ ఆలశ్యంచెయ్యడం, ఆయన వాళ్ళమీద అలిగి, అరవడం జరిగేది. రాను, రానూ ఆయన ఖచ్చితత్వం మరుగున పడిపోయి, అందరిమీదా అరుస్తాడనే అపప్రద వచ్చిపడింది. 

`వాడు చూడు ఎప్పుడూ క్లాసు ఫస్టే! నువ్వూ ఉన్నావు ఎందుకు?` `సచిన్ తెండూల్కర్ పదహారేళ్ళకే అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చేశాడు. నీకు పాతికేళ్ళు వచ్చినా స్థిరత్వం రాలేదు.` ఇలా చెప్పడంవల్ల ఆమాటలు విని ఆచరించాలనుకొనేవారికి మానసికవొత్తడి పెరుగుతుంది. మంచిని పెద్దవాళ్ళూ, శ్రేయోభిలాషులూ కాక మరెవరు చెపుతారు? కాకపోతే మరెవరినో ఉదాహరణగా చూపించి అలా ఉండడమే సరైన పద్దతి అనడం అభిలషణీయం కాదు.  చెప్పినవాళ్ళు నిజంగా మంచికోసం చెప్పినా ఎదుటివారిలో మార్పు తీసుకొని రావడం అటుంచి, వాళ్ళకి విరోదులు కావడం జరుగుతుంది. 

మన సామర్ధ్యం, విజయం, అందం, బలం, ప్రవర్తన, ఆర్ధికవెసలుబాటు మనవే. అవి మిగిలినవారికంటే ఎక్కువో, తక్కువో అయి ఉండవచ్చు. మనం పైమెట్టుమీద ఉన్నప్పుడు `నన్నందుకో,` అని ఆయా విషయాలలో తక్కువగా ఉన్నవాళ్ళకి సవాలు చెయ్యడం. క్రిందమెట్టుమీద ఉన్నప్పుడు పైనున్న వాళ్ళను చూసి న్యూనత ఫీలవ్వడం రెండూ తప్పే!   

ఎదుటివారి విజయాలని చూసి స్పూర్తిపొంది ముందడుగు వెయ్యాలికానీ, మనం చెయ్యలేకపోతున్నాం అని స్ట్రెస్‌ఫీలవ్వకూడదు. అన్నీ అనుకూలించి, విజయం మన సొంతమైతే - ఇంకా విజయంకోస ప్రయత్నిస్తున్న తోటి వాళ్ళకి వొత్తడి పెంచకూడదు. ఎవరి అనుకూలతలు, ప్రతికూలతలూ వారివే. ఒకరికి, ఇంకొకరితో పోలికే లేదు. మనకున్న ప్లస్ పాయింట్లలో పెర్ఫెక్ట్ అయితే, మైనెస్ పాయింట్లలో ఇంపెర్ఫెక్టే కదా? అందరికీ అన్నీ ప్లస్ పాయింట్లే ఉండవు కదా?   
© Dantuluri Kishore Varma

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!