Pages

Saturday 19 April 2014

తిరుమల నంబి

పదకొండవ శతాబ్ధంలో తిరుమలలో తిరుమల నంబి అనే శ్రీనివాసుని భక్తుడు ఉండేవాడట. ప్రతీరోజూ తిరుమల దేవాలయానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న పాపనాశం నుంచి నీరు తీసుకొని వచ్చి స్వామివారికి అభిషేకం చేసేవాడు. ఒకరోజు యదావిధిగా అభిషేకజలాన్ని ఒక కుండలో పట్టుకొని తీసుకొని వస్తుంటే విల్లంబులు ధరించిన ఒక వ్యక్తి తిరుమల నంబిని దాహానికి నీళ్ళు ఇమ్మని కోరతాడు. కానీ, తిరుమల నంబి అందుకు తిరస్కరించి ముందుకు వెళుతూ ఉండగా ఆ వ్యక్తి బాణంకొసతో కుండకి రంద్రంచేసి, కారుతున్న ధారకు దోసిటపట్టి దాహం తీర్చుకొంటాడు. ఆ తరువాత ఒక శరసంధానం చేసి అదే ప్రదేశంలో భూమిలోనుంచి పైకి నీటిని రప్పిస్తాడు. ఆ నీటి ఊటనే ఆకాశ గంగ అంటారు. అలా చేసిన వ్యక్తి సాక్షాత్తూ శ్రీనివసుడేనట.

తిరుమల స్వామివారి ఆలయంలో ఇప్పటికీ అభిషేకాది కైంకర్యాలు నిర్వహించేది తిరుమల నంబి వంశస్తులేనట. తిరుమల నంబి దక్షిణమాడవీధిలో నివాశం ఉండేవాడట. అందుకే ఇప్పుడు అక్కడ ఆయన పేరుమీద ఒక గుడి ఉంది.

© Dantuluri Kishore Varma 

No comments:

Post a Comment

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!