Pages

Sunday 18 May 2014

యండమూరులో మీసాల వెంకన్న

కాకినాడనుంచి గొల్లపాలెం మీదుగా కోటిపల్లి వెళ్ళే మార్గంలో యండమూరు జంక్షన్ తగులుతుంది. జంక్షన్ నుంచి  ఊరు లోనికి ఉంటుంది. కరప మండలంలోని చిన్న గ్రామం ఇది. ఈ వూరిలో శ్రీసామ్రాజ్యలక్ష్మీ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయం ఉంది. చాలా పురాతనమైనదని చెపుతారు. ప్రస్తుతం ఉన్న గుడి కొత్తగా పునర్నిర్మించిందే కానీ, మొట్టమొదట శ్రీరామచంద్రమూర్తి కాలంలో నిర్మించి ఉంటారని చెపుతారు. దానికి కారణం ఏమిటంటే ఈ దేవాలయపు పునర్నిర్మాణ సమయంలో ములవిరాట్టు క్రింద శ్రీరాముని ముద్రలతో ఉన్న నాణాలు లభించాయట. యండమూరులో ఉన్న వేంకటేశ్వరుణ్ణి మీసాల వెంకన్న అనికూడా పిలుస్తారు. కోరిన కోరికలు నెరవేరుస్తాడని ప్రసిద్ది. ఈ ఫోటోలు మీకోసం. దర్శనం చేసుకొని ధన్యులు కండి.  



© Dantuluri Kishore Varma 

No comments:

Post a Comment

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!