కాకినాడ కుళాయిచెరువు ప్రాంగణంలో ఏర్పాటుచేసిన 37వ వ్యవసాయ, ఫల, పుష్ప ప్రదర్శన(ఎగ్జిబిషన్)లో ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణ అనంతపద్మనాభస్వామి దేవాలయ సెట్. ఇరవై ఐదు లక్షల వ్యయంతో ఈ సెట్టు నిర్మాణం జరిగిందని చెబుతున్నారు. ఒకచోటనుంచి మరొకచోటుకి తరలించగల సౌలభ్యం ఉన్న కారణంగా దీనిని ఇంతకుముందు యలమంచిలి లో ప్రదర్శించారట. ఇక్కడి ఎగ్జిబిషన్ ముగిసిన తరువాత కాకినాడనుంచి దీనిని విశాఖపట్టణానికి తీసుకొనివెళతారు.
ఆలయ ఆకారం తిరువనంతపురాన్ని పోలిలేదుకానీ, లోపలి అనంతపద్మనాభుని విగ్రహం మాత్రం చాలా పోలికలు కలిగిఉండి, బాగుంది. పద్దెనిమిది అడుగుల పొడవుతో, బంగారురంగు పూతతో మనోహరంగా మలిచారు. 
తిరువనంతపురం దేవాలయ నేలమాళిగలలోనుంచి బయటపడిన లక్షలకోట్ల సంపద వల్ల ఈ దేవాలయ ప్రశస్థి  దేశదేశాలూ పాకిపోయింది. ఈ విషయాన్ని దృష్ఠిలో ఉంచుకొని నేల మాళిగలోని తెరిచిన  గదులనుకూడా ఇక్కడ ఏర్పాటుచేశారు. మచ్చుకి రెండు గదులకి తీసిన ఫొటోలని ఇక్కడ ఇస్తున్నాను చూడండి. 
అత్యంత రహస్యమైన చివరిగది నాగబందంతో మూసి ఉంచారని, దానిని తెరవాలంటే గరుడమంత్రం తెలిసిన మహా సాధు పండితులు కావాలని, కానీ అటువంటివాళ్ళు ఇప్పుడు లేరని.. రకరకాలుగా కథనాలు ప్రచారమయ్యాయి. ఈ క్రమంలో నాగబందం అనేదానికి చాలా క్రేజ్ వచ్చింది. అదీకాక నాగవల్లి సినిమాలో చూపించిన మూసిన గదితలుపులు, వాటిమీద పెద్ద సర్పాకారపు బందనం! నాగబందాన్ని కూడా మనం ఎగ్జిబిషన్లో చూడవచ్చు. 
మీరు తిరువనంతపురం అనంతపద్మనాభుని గురించి తెలుసుకోవాలనుకొంటే, ఈ బ్లాగ్లో ఇంతకు ముందు రాసిన ఈ టపా చదవండి.
© Dantuluri Kishore Varma






 
good
ReplyDeleteథాంక్స్ శర్మగారు.
ReplyDelete